Header Banner

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

  Tue Jun 03, 2025 13:42        Politics

ఏపీ లిక్కర్ స్కాం (AP Liquor Scam) కేసులో నిందితుల రిమాండ్‌ను విజయవాడ కోర్టు (Vijyawada Court) పొడిగించింది. ఈ కేసులో ఏడుగురు నిందితుల రిమాండ్ ఈరోజుతో (మంగళవారం) ముగిసింది. దీంతో రాజ్‌ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చాణక్య, దిలీప్‌, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఏడుగురు నిందితులకు ఈనెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లిక్కర్ కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు సమయంలో సీబీఐ కోర్టు న్యాయాధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. రిమాండ్ పొడిగింపునకు ఇంతమంది అవసరమా అంటూ డిఫెన్స్ న్యాయవాదులను న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టుకు వచ్చిన నిందితుల కోసం వారి కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు తరలివచ్చారు. నిందితులను కోర్టులో హాజరుపరచగానే వీరంతా కూడా లోపలకు ప్రవేశించారు. ఈ క్రమంలో న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. సాఫీగా రిమాండ్ పొడిగింపు జరిగే దాని కోసం ఇంత హడావిడి అవసరమా అంటూ ప్రశ్నించారు. ఇదే జరిగితే ఇప్పటి వరకు తెరిచి ఉన్న తలుపులు మూసుకుపోతాయంటూ సీబీఐ కోర్టు న్యాయాధికారి వ్యాఖ్యానించారు. ఇక.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులను కూడా పలు దఫాలుగా కస్టడీలోకి తీసుకుని విచారించింది సిట్.

 

ఇది కూడా చదవండి: వెన్నుపోటు దినం కాదు... పశ్చాతాప దినం చేసుకోండి! మంత్రి తీవ్ర విమర్శలు!

 

ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొదట వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు సిట్ అధికారులు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి అత్యంత సన్నిహింతంగా వెలిగిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ ఆఫీసర్స్‌ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ ముగ్గురితో పాటు మరోసారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్‌ వేశారు. ఇందుకు కోర్టుకు కూడా అనుమతించింది. నలుగురు నిందితులను రెండు రోజుల పాటు సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని పలు దఫాలుగా విచారించారు. ఈ నలుగురు చుట్టూనే మద్యం వ్యవహారం మొత్తం నడిచినట్లు ఇప్పటికే సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎలా విచారణ చేసినా, ఏ వైపు నుంచి మొదలు పెట్టినా కూడా మద్యం కుంభకోణంలో ప్రధానంగా వీరి పాత్ర ఉన్నట్లు చెబుతున్నారు. వీరి వెనక ఉన్న అసలు బాస్ ఎవరున్నారనే దానిపై నిర్ధారణకు వచ్చిన సిట్... అతనికి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరో వారం పది రోజుల్లోనే మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మరిన్ని అరెస్ట్ జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరి రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపర్చగా.. 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ ఏడుగురు నిందితులను సిట్ అధికారులు తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

 

ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #ApliquorScam #SupremeCourt #RejectsBail #DhanunjayaReddy #KrishnaMohanReddy #RemandExtended